13.7.25

టీటీడీ, దేవాదాయ శాఖ సమన్వయ సమావేశం Endowments minister





ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ అనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య పెండింగ్‌లో ఉన్న సంయుక్త అంశాలపై శనివారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు.

కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ మరియు పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉపకార్యదర్శి శ్రీ సుధాకర్ రావు, ఏపీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.వి.ఆర్. శేఖర్, పలువురు టీటీడీ మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments