31.7.25

త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య‌ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం Tarigonda Temple




అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు సంబంధించి బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభమ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠ నిర్వ‌హించారు. సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహించ‌నున్నారు.

జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.

ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఆల‌య అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.  

No comments :
Write comments