15.7.25

తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువులలో మార్పు Tirumala Canteens




తిరుమలలోని 5 పెద్ద కాంటీన్లు, 5 జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ మరియు పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేయడం జరిగింది.


తాజా షెడ్యూలు ప్రకారం మారిన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి:

పెద్ద కాంటీన్లకు:

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుండి  26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చడం జరిగింది. 

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుండి  28-07-2025 ఉదయం 11 గంటలకు మార్చడం జరిగింది.

పత్రాల తెరిచే తేది : 

17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చడం జరిగింది.

జనతా కాంటీన్లకు :

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేయడం జరిగింది.

పత్రాల తెరిచే తేది: 

19-07-2025 నుండి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించి, దాని ప్రకారం తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments