వాల్మీకిపురం శ్
ఇందులో భాగంగా ఉదయం 10 గంటల కు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్ వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశే షంగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం వైభవంగా ప్రారం భమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు . ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్ రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు . అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమా లు, పూర్ణాహుతి, నివేదన, అక్షతా రోహణం, ముత్యాల తలంబ్రాల సమ ర్పణ, విశేష నివేదన, మాలమా ర్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమాని కి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చా రు. కల్యాణం అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై విహరించి భక్తు లను అనుగ్రహించనున్నారు.
జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉద యం 6.30 గంటలకు స్నపనతిరుమం జనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం వైభవం గా జరుగనుంది. సాయంత్రం 6 గం టలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గం టలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభి రాముడు విహరించి భక్తులకు దర్ శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుం భప్రోక్షణం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చె ల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె , అన్నప్రసాదం బహుమానంగా అందజే స్తారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రే డ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ ష్మీ, ఆలయ అధికారులు, అర్చకు లు పాల్గొన్నారు.

No comments :
Write comments