టిటిడి శ్రీ
గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్ మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్ యంత ఘనంగా నిర్వహించనుంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ ని తలపించే విధంగా టిటిడి శ్రీ వేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మా మిడితోరణాలు, పూమాలలతో అలంకారా లు చేపట్టనుంది. గోశాలలోని గోసం పదను అందంగా అలంకరించి భూలోక గో కులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ముత్యాల రం గవల్లికలతో తీర్చిదిద్దుతున్నా రు.
గోశాలకు విచ్చేసే భక్తులు గోశా లలో బెల్లం, బియ్యం, పశుగ్రాసా న్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గో వును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్ యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలి పి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గో వుకు మేతదానం చేస్తే మహాపుణ్ యఫలమని భక్తుల భావన, నమ్మకం. కా వున టిటిడి సందర్శకులకు గోశాలలో ని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గో సంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్ రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్ య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గం టల నుండి సాంస్కృతిక కార్యక్రమా లు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తా రు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్ యక్రమం నిర్వహించనున్నారు.

No comments :
Write comments