14.8.25

ఆగష్టు 19 - 21 తేదీల్లో అమరావతిలోని ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు amaravati temple




అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆగష్టు 19 - 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మహా నగరం అమరావతి ( వేంకటపాలెం)లో టిటిడిచే నిర్మింపబడి, కొలువుతీరి వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుందు ప్రప్రథమంగా లోక కల్యాణార్థం, సర్వలోకహితార్థం శ్రీ వేఖానస భగవచ్ఛాస్త్రరీత్యా పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.


ఆగష్టు 18వ తేదీ సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణం జరుగనుంది. ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణము, సేనాధిపతి ఉత్సవం, మృతస్సంగ్రహణం నిర్వహిస్తారు.

ఆగష్టు 19న ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.

ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.

No comments :
Write comments