17.8.25

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక Adi Krutika












తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.


ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగాఅభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు  శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య  ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments