16.8.25

టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్య్ర‌ దినోత్సవం I-Day











తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర‌ వేడుకలు శుక్ర‌వారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.


ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ క్రిష్ణ‌య్య‌ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 41 మంది అధికారులు, 278 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు.

ఆల‌రించిన‌ సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు " కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ......",  " జై అందమంతా ఒకటై ....." తదితర దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలకు చ‌క్క‌టి నృత్యం ప్ర‌ద‌ర్శించారు.  ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

No comments :
Write comments