13.8.25

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై అదనపు ఈవో సమీక్ష sv museum




తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది   ప్రపంచ స్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్  చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments