ఎస్పీడబ్ల్యూ
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మా ట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశా లలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థి నులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధి కారులకు సూచించారు. కళాశాలలోని సమస్యలను టిటిడి జే ఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపా ల్ తన దృష్టికి తీసుకువచ్చారని , వాటి అన్నింటిపై నివేదిక తయా రు చేయాలని ఆయన అధికారులను ఆదే శించారు. విద్యార్థినులు చదువు కునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు.
ముఖ్యంగా కళాశాలలో విద్యార్థిను లకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వై ద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ - లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పా టు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజి కల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయా రు చేసి కార్యాచరణ సిద్ధం చేయా లని అధికారులకు టిటిడి ఛైర్మెన్ సూచించారు.
అంతకుముందు టిటిడి ఛైర్మెన్ శ్ రీ బీఆర్ నాయుడు అధికారులతో కలి సి కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశా రు. అటు తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు .
ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో శ్ రీ వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా. సి. భువనేశ్వరి, ఎస్.ఈ శ్రీ మనోహరం తదితరం అధికారులు పాల్ గొన్నారు.








No comments :
Write comments