18.8.25

సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం viswasanti mahayagam






భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో ఆదివారం సాయంత్రం నుండి సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఘనంగా ప్రారంభమైంది.


ఈ మహాయాగం ఆగస్టు 20వ తేది వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది. తొలి రోజు సాయంత్రం 6 గంటలకు ఆచార్యవరణం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం కార్యక్రమాలు వైదికంగా నిర్వహించారు.

మొత్తం 32 మంది వేదపండితుల సమక్షంలో జరిగే ఈ మహాయాగంలో వేదపారాయణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరుగుతాయి. ఆగస్టు 20న పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.

ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఇతర అధికారులు,  పాల్గొన్నారు.

No comments :
Write comments