25.9.25

శ్రీవారికి రూ.3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం gold yagnopaveetam




తిరుమల శ్రీవారికి విశాఖపట్నం చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండీ శ్రీ పువ్వాడ మస్తాన్ రావు, శ్రీమతి కుంకుమ రేఖ దంపతులు రూ.3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతంను బుధవారం విరాళంగా అందజేశారు.

వజ్రాలతో పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం 3.860 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. 
ఈ మేరకు దాతలు ఈ కానుకను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దాతలను అభినందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments