4.9.25

టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం electric bus





టీటీడీకి బుధ‌వారం ఉదయం విద్యుత్ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సిఈవో శ్రీ గ‌ణేష్ మ‌ణి, చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫీస‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ్‌ రూ.1.33 కోట్ల‌ విలువైన విద్యుత్‌ బస్సును అందజేశారు. 

 
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రికి అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య పేష్కార్ శ్రీ రామ‌క్రిష్ణ‌, తిరుమల డిఐ శ్రీ వెంక‌టాద్రి నాయుడు పాల్గొన్నారు.

No comments :
Write comments