శ్రీవారి
అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకు ల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5. 43 నుండి 6.15 గంటల వరకు మీనలగ్ నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచి కగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరు డ పతాకం ఎగురవేసి ముక్కోటి దే వతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వాని స్తారు. రుత్వికులు వేద మంత్రా లతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్ టూ చుడతారు. దర్భతో పేనిన తాడు ను ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శా ఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, వి ష్ణు దర్భ అనే రెండు రకాలు ఉం డగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూ రు గ్రామంలో విష్ణుదర్భను టిటి డి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బా గా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్ భ చాప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తా డు సిద్ధం చేశారు.
దర్భ వైశిష్ట్యం
దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్ త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అని దర్భను శుద్ ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదం లో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠఫలితాలను ఇస్తుం దని పేర్కొంది. శాస్త్రీయంగా చూ సినా ఇందులో సిలికా అధికంగా ఉం డటంతో వాతావరణ శుద్ధి, సూక్ష్ మక్రీముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం, దైవిక వరమని భావిం చబడుతుంది.



No comments :
Write comments