తిరుమల శ్
ది క్వింట్సెన్స్ ఆఫ్ రిగ్ వేద ఆన్ ఇంట్రడక్షన్ - శ్రీ వాసుదే వరావు
వేదాలను వేసభగవానులు ఋగ్వేద యజు ర్వేద సామవేద అధర్వణ వేదాలని నా లుగు వేదాలుగా విభజించారు ఈ వే ద వాంగ్మయంను గురుకులాల్లో బోధి స్తూ వచ్చారు. తర్వాత కాలంలో ఈ వేద వాంగ్మయం గ్రంథస్తం చేశారు. ఋగ్వేదం మానవాళి యొక్క ప్రాచీ నమైన ఆధ్యాత్మిక గ్రంథం. జీవాత్ మ పరమాత్మల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది.
సనాతన భారతీయ సంస్కృతి పురోగతి లో ఋగ్వేదం ఒక ప్రధానమైన మైలురా యిగా నిలిచింది. ఋగ్వేదంలోని ప్ రధాన విషయాలను పరిశీలించి ఎంపి క చేసి ఆంగ్లంలో వాటికి విశేషమై న వ్యాఖ్యానాన్ని అందించారు.
శ్రీహరి భక్త విజయం - డాక్టర్ నర్సం నరసింహ చార్య
కలియుగంలో భగవంతుని చేరుకునే ఏకైక సాధనం భక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా స్వీకరిస్తాను అన్నారు. భక్తి లేకుండా సమర్పించిన బంగా రమైన పరమాత్ముడు స్వీకరించడు. కలియుగంలో హరినామ స్మరణకు మించి న తరుణోపాయం లేనే లేదు. భగవంతు ని చరిత్రను తెలుసుకోవడం, అర్థం చేసుకుని మననం చేసుకోవడం, వారి ఆదర్శాలను అందుకోవడం ద్వారా మా నవ జీవనం సఫలం అవుతుంది.
శ్రీహరి భక్త విజయం అనే గ్రంథం లో ప్రహ్లాదుడు, అంబరీష్యుడు, కుబేరుడు, ద్రువుడు, నారదుడు ము న్నగు భాగవతోత్తముల కథలతో పాటు వెంకటాచలం మహత్యంలోని కథలను కూ డా సులభమైన తెలుగులో అందించారు.
ఆనంద నిలయం - డాక్టర్ ఎస్ ఎస్ లీ
వెంకటాద్రి కి సమానమైన క్షేత్రం కానీ, శ్రీ వేంకటేశ్వర స్వామి కి సమానమైన దైవం కానీ ఇంతకుముం దు లేదు. ఇకపై ఉండబోదు అని వివి ధ పురాణాలు తెలియజేస్తున్నాయి.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వెం కటాద్రిని చేరిన విధానం, వరాహ క్షేత్రంపై నివాసం ఏర్పరచుకొని ఆనంద నిలయ దివ్య విమానాన్ని వై కుంఠం నుండి తెప్పించుకోవడం, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంతో పాటు స్వామి పుష్కరిణి మహత్యం, తిరుమల క్షేత్రంలోని దివ్య తీ ర్థాలు, తొండమానుని ఇతివృత్తం మొదలైన అనేక విషయాలను కన్నడ భా షలో ఈ గ్రంథం వ్రాశారు.
ఈ కార్యక్రమంలో ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్ నారు.


No comments :
Write comments