తిరుమల శ్రీ
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎటు చూసినా ఈసారి అనూహ్యంగా సానుకూ ల వాతావరణం కనిపించిందని టిటి డి ఈవో తెలిపారు. భక్తులకు టిటి డి కల్పించిన సౌకర్యాలపై గ్యా లరీలు, క్యూలైన్లలోని భక్తులు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చే యడం గమనార్హమన్నారు. బ్రహ్మోత్ సవాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వా నించేందుకు వెళ్లిన సమయంలో సిఎం గారు పలు సూచనలు చేశారని, టిటి డి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, జిల్లా యం త్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టిటిడిలోని వివిధ శాఖల అధికారు లు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమిష్టి సహకారంతో విజయవంతం అయ్ యాయన్నారు. శ్రీవారి బ్రహ్మోత్ సవాల ప్రారంభం నుండి చివరి రోజు వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మో త్సవాల ప్రారంభం రోజునే దేశ ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృ ష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గార్లు పర్యటన, పీఏసీ - 5 ప్రారంభోత్సం తదితర కార్యక్ రమాలు ఉన్నా అందరూ సమిష్టిగా పనిచేశారన్నారు.
బ్రహ్మోత్సవాలలో గ్యాలరీలలోను, క్యూలైన్లలోను, గరుడ సేవ రోజు ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదాలు అందిం చేలా, ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని, ఆకట్టుకునేలా విద్యు త్ కాంతులు, పుష్ప అలంకరణలు, రవాణా, ట్రాఫిక్, తదితర సేవలలో అందరూ చిత్తశుద్ ధితో పనిచేశారన్నారు. వచ్చే బ్ రహ్మోత్సవాలకు సిసి కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అం చనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటి నుండే ప్ రణాళికలు రూపొందించాలని సూచించా రు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుండే మార్గదర్శిని రూపొందించామన్నారు. అనివార్య కారణాలతో రాలేకపోయినా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కాన్ పరెన్స్ లతో సమీక్షించుకున్నా మన్నారు. టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, అనుభవజ్ఞులైన ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గా రి సూచనలతో సమిష్టిగా పనిచేశా రన్నారు. బ్రహ్మోత్సవాలపై ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని రాబో వు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీ వి వీ రబ్రహ్మం మాట్లాడుతూ, ప్రతి రో జూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారన్నారు, ముఖ్యంగా మాడ వీధు లతో పాటు బయట క్యూలైన్లలోని భక్ తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ, పాలు, బాదం పాలు అందిం చేందుకు సిబ్బంది చక్కగా పని చే శారన్నారు. ఇదే స్ఫూర్తితో సమన్ వయంతో తిరుచానూరు పద్మావతీ అమ్ మవారి బ్రహ్మోత్సవాల విజయవంతాని కి కృషి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరా యుడు మాట్లాడుతూ భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టిటిడి, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో పనిచేశారన్ నారు. ఈ ఏడాది టెక్నాలజీ సేవలను బాగా సద్వినియోగం చేసుకున్నా మన్నారు. కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ సమస్య లే కుండా, వృద్ధులకు సేవలు, చిన్న పిల్లలకు జియో ట్యాగ్ సిస్టం ఏర్పాటు, సోషల్ మీడియా, సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశా రన్నారు. తిరుపతి జేఈవో నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను తెలు సుకుని పరిష్కరించేలా అధికారులు , సిబ్బందిని సమన్వయం చేశారన్నా రు.
టిటిడి సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, టిటిడి ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్ రీ నారా చంద్రబాబు నాయుడు అభినం దించడం ఆనందం వేసిందన్నారు. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తు లు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చే సినట్లు తెలిపారు. టిటిడి నిర్ వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ మరింత జాగురూకతతో పనిచేయాలని సూచించా రు.
ఈ కార్యక్రమంలో టిటిడి మరియు పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.










No comments :
Write comments