తిరుమల శ్రీ
తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్ వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూ టీ ఈవో శ్రీ లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్ రీ శ్రీనివాసులు, ఉద్యానవన సి బ్బంది, శ్రీవారి సేవకులు కలి సి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవా రి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం ముం దు మీడియాతో మాట్లాడుతూ శ్రీవా రి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలి యక దోషాలు జరిగి ఉంటే ఆ దోష ని వారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయి న ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీ టీడీ పునరుద్ధరించి నిర్వహిస్తు న్నదన్నారు.
శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకు రార్పణ నిర్వహించినట్లు తెలిపా రు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తి రుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తు లకు శోభాయమానంగా పుష్పయాగం జరు గుతుందన్నారు. ఇందుకోసం 16 రకా ల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తా మని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెం డు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళం గా అందించారని వెల్లడించారు.






No comments :
Write comments