14.11.25

న‌వంబ‌రు 16న‌ శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ – ఉద‌యం ల‌క్ష కుంకుమార్చ‌న‌ laksha kumkumarchana




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుండి 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌ కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.


న‌వంబ‌రు 17న ధ్వ‌జారోహ‌ణం

ఆలయంలో న‌వంబ‌రు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మ‌ధ్య ధనుర్ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

వాహనసేవల వివరాలు :
తేదీ

  17-11-2025  

ఉద‌యం - ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)      

రాత్రి - చిన్నశేషవాహనం

  18-11-2025

ఉద‌యం - పెద్దశేషవాహనం                                  

రాత్రి - హంసవాహనం

19-11-2025      

ఉద‌యం - ముత్యపుపందిరి వాహనం        

రాత్రి - సింహవాహనం

20 -11-2025    

ఉద‌యం - కల్పవృక్ష వాహనం                  

రాత్రి - హనుమంత వాహనం

21 -11-2025      

ఉద‌యం - పల్లకీ ఉత్సవం                          

రాత్రి - గజవాహనం

22-11-2025      

ఉద‌యం - సర్వభూపాలవాహనం      

స‌మ‌యం -  స్వర్ణరథం,    

రాత్రి  -      గరుడవాహనం

23-11-2025    

ఉద‌యం - సూర్యప్రభ వాహనం        

రాత్రి - చంద్రప్రభ వాహనం

24-11-2025      

ఉద‌యం - రథోత్సవం                  

రాత్రి - అశ్వ వాహనం

25-11-2025    

ఉద‌యం - పంచమీతీర్థం              

రాత్రి - ధ్వజావరోహణం.

No comments :
Write comments