14.11.25

అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి రైస్ మిల్లర్లతో సమావేశంలో టీటీడీ అదనపు ఈవో rice millers




తిరుమలలోని అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు.


పద్మావతి విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

- ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత  ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు. తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు అవకాశం.

- బియ్యం శాంపిల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్న ప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశం

- రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలి. తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం.

- టీటీడీలో ప్రతిరోజూ తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20 వేల కేజీల బియ్యం వినియోగం. 

- టీటీడీకి 60:40 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్లర్ల బియ్యం సరఫరా.

- ప్రతినెలా రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశం.

- శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెలా అన్న ప్రసాదం నాణ్యతపై సర్వే. భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు.

టీటీడీలో కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీ లోని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌజ్ కార్పోరేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్టీఆర్ఐ సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వపై మరింత మెరుగైన సౌకర్యాలు రూప కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వేర్ హౌజ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, ప్రొక్యూర్ మెంట్ విభాగాధిపతి శ్రీ ఉమా శంకర్, శ్రీవారి ఆలయ పోటు ఏఈవో మునిరత్నం, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments