2.11.25

రాజంపేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శాస్త్రోక్తంగా మహాకుంభరాధనం, జలాధివాసనం mahakumbhabhishekam





అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శనివారం శాస్త్రోక్తంగా మహాకుంభరాధనం, జలాధివాసనం చేపట్టారు.


శనివారం ఉదయం భగవత్పుణ్యాహం, మనోన్మాన శాంతి హోమం, అగ్నిమధనం, పంచకుండములలో అగ్నిప్రణయనం, మహాకుంభరాధానం, చక్రాజమండలారాధనములు, ద్వాదశాక్షర, అష్టాక్షర, షడక్షర, విష్ణుగాయత్రీ పంచసూక్త పూర్వక మూర్తి హోమం, వేద ప్రబంధాధి పారాయణములు, పూర్ణాహుతి, శాత్తుమొర, తీర్థగోష్టి తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం మూర్తి హోమం, చతు:స్థానార్చన, వేద, ప్రబంధ, విష్ణు సహస్రనామ పారాయణములు, జలాధివాసనం, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నవంబర్ 02వ తేదీ ఉదయం విమానగోపుర, ప్రసాదములకు ఛాయాధివాసం, కర్మాంగ స్నపనం, మూర్తి హోమం, స్నపన తిరుమంజనం, శయ్యాధివాసం, వేదాది పారాయణములు, జీవాధి తత్వన్యాస హోమం, పంచసూక్త హోమం తదితర కార్యక్రమాలు చేపడుతారు.

నవంబర్ 03వ తేదీన ఉదయం 04 గం.టల నుండి 05 గం.ల లోపు విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణం, ఉదయం 09 గం.లకు మహా పూర్ణాహుతి, తదుపరి మహాకుంభాప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టాన్యాసములు, ప్రథమ కాలారాధనం జరుగనుంది. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణం, ప్రాకారోత్సవనం, ధ్వజావరోహణంను వేడుకగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ధ్యానమందిరం (108 అడుగుల విగ్రహం) వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ ఎ.శివప్రసాద్, ఏఈవో శ్రీ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. 

No comments :
Write comments