25.11.25

తిరుచానూరులో వైభవంగా రథోత్సవం rathostavam










తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది.

ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిందిభక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారుసర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో  తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదుభక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞంసింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించిమోక్షం లభిస్తుంది.

రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.  ఇందులో పసుపుచందనంపాలుపెరుగుతేనెపన్నీరువివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారుఅనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామిఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్,  జేఈవో శ్రీ వివీర బ్రహ్మంసివిఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్ఆలయ అర్చకులు

శ్రీ బాబు స్వామిశ్రీ శ్రీనివాసా చార్యులుఅర్చకులుఇతర ధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments