టీటీడీ
శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.60 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన శ్రీమతి కె.యన్.నయన, శ్రీమతి వి.ప్రభా, శ్రీ రాజేష్, శ్రీ కె.యన్.రాజేష్, గుంటూరుకు చెందిన శ్రీ దేవరశెట్టి రితీష్, శ్రీ దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.
No comments :
Write comments