3.12.25

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి





తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగిందిప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


శ్రీవారి ఆలయ అర్చకులుపరిచారకులుభక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారుఅక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకురసింహస్వామివారికిఆంజనేయస్వామివారికి అభిషేకంపుష్పాలంకారం చేపట్టి హార‌తి ఇచ్చారుహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 1సంవత్సరాలు తపస్సు చేశాడుఅందుకు సంతసించి శంఖుచక్రగధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడుపద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడుఅయితే ఒకనాడు  రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడుఅప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి  రాక్షసుని సంహరించాడుఅటు తరువాత  మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని  ప్రాంతంలోనే ఉండి క్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడుభక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని  ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో  తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.


వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్ర‌ముఖ తీర్థంగా భాసిల్లుతోంది.


 కార్యక్రమంలో ఆలయ అధికారులుఅర్చకులుభ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments