నవంబర్
28 నుం
డి
16 రోజుల
పాటు
తిరుమలలో
నిర్
వహించిన
షోడశదిన
సుందరకాండ
పారా
యణం
ధర్మగిరి
వేద
విజ్ఞాన
పీఠం
లో
శనివారం
పూర్ణాహుతితో
ఘనంగా
ముగిసింది
.
లోక కళ్యాణార్థం తలపెట్టిన పారాయణంలో భాగంగా నవంబర్ 28 నుండి డిసెంబర్ 13వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 9 నుండి 12 గంటల మధ్య ఆరాధన, అభిషేకం, హోమం, అనుష్టానం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments :
Write comments