తిరుమల
తిరుపతి దేవస్థానముల (టిటిడి) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో ఆశ, వెలుగులు నింపుతూ ఒక నిజమైన జీవనాడిగా నిలుస్తోంది. విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సంరక్షణతో పాటు సాంస్కృతిక, నైతిక విలువలను అందిస్తూ సమాజంలో ఆదరణకు దూరమైన పిల్లలకు ఒక సురక్షితమైన భవిష్యత్తు దిశను చూపిస్తోంది.
1943లో ఎస్వీ అనాధాశ్రమంగా ప్రారంభమైన ఈ సంస్థ, అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో 1961లో అప్పటి ప్రధానమంత్రి చాచా జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎస్వీ బాలమందిరంగా నామకరణం చేశారు. 2014లో ఈ ఎస్వీ బాలమందిరాన్ని శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ పరిధిలోకి టిటిడి తీసుకొచ్చింది.
ప్రారంభంలో పరిమిత సంఖ్యలో పిల్లలతో ప్రారంభం
2003 నాటికి సంవత్సరానికి 300 మంది, 2005లో 500మంది విద్యను అభ్యసించేలా సీట్ల సంఖ్యను పెంచారు.
2025–26 విద్యా సంవత్సరంలో ఎస్వీ బాలమందిరంలో 100 మంది బాలికలు, 143 మంది బాలురు, పదో తరగతి అనంతరం టిటిడి, ఇతర ప్రైవేట్ కళాశాలలో బాలురు 56, బాలికలు 49 టిటిడి సంరక్షణలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత వైద్యం, పూర్తి భద్రతతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందిస్తూ ఎందరో అనాథ పిల్లల భవిష్యత్తుకు ఎస్వీ బాలమందిరం బలమైన పునాదిగా నిలుస్తోంది.
ఎంపిక విధానం
హిందూ మతానికి చెందిన 5 ఏళ్లు నిండిన, 10 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలను మూడు కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.
ఏ కేటగిరి: తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం
బీ కేటగిరి: తల్లి లేదా తండ్రి లేని పిల్లలు
సీ కేటగిరి: పేద వర్గాలు, తల్లిదండ్రులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లేదా మానసిక వైకల్యం, వికలాంగత కలిగిన వారి పిల్లలు
టిటిడి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా సంరక్షకులు దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.
విద్య & వసతులు
ఎంపికైన పిల్లలను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు – ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు – శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలో చేర్పిస్తారు. బాలమందిరంలో పిల్లలకు ఉదయం పాలు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించబడుతుంది. 10వ తరగతి పూర్తయ్యాక బాలురను ఎస్వీ జూనియర్ కాలేజీలో, బాలికలను ఎస్వీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో చేర్పిస్తారు. విద్యార్థులకు స్టేషనరీ, దుస్తులు, కాస్మోటిక్స్ వంటి మౌళిక అవసరాలను టిటిడి ఉచితంగా అందిస్తోంది. విద్య, వసతి, వైద్యం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు టిటిడి ఉన్నతాధికారులు, ఎస్వీ బాలమందిరం అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడతాయి.
కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య
డిసెంబర్ 4, 2025న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధ్యక్షతన జరిగిన శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ సమావేశంలో, 10వ తరగతిలో 75 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అందించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎస్వీ బాలమందిరంలో చదివిన పలువురు విద్యార్థులు ఎస్.ఎస్.సిలో 600కి 580 పైగా మార్కులు, ఇంటర్మీడియట్లో 1000కి 982 మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారు. మరింత నాణ్యమైన విద్య అందించేందుకు టిటిడి పటిష్ట చర్యలు చేపడుతోంది.
ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు
టిటిడి ఎస్వీ బాలమందిరంలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య అనంతరం టిటిడిలో పలు ఉన్నత హోదాల్లోను, ఐటీ రంగంలో, మెడికల్, ప్రభుత్వ ఉద్యోగులు తదితర
No comments :
Write comments