23.12.25

ఎస్వీబీసీ హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన ప్రసారాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ svbc channel review




ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్నికైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో స్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారుటిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్‌డీ ఛానల్ అప్‌లింకింగ్ , డౌన్‌లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు హెచ్ డీ ఛానల్ నిర్వహణకు అవసరమై చర్యలు చేపట్టాలన్నారు.  


అదేవిధంగాఎస్వీబీసీ ఛానల్ లో ఇప్పటి  వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్ లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారనివాటిని 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకువారి కుటుంబ సభ్యులకు స్విమ్స్ లో సాధారణ వైద్య చికిత్సలుఅరవింద్  హాస్పెటల్ లో కంటి వైద్య చికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు


ఎస్వీబీసీ ఉద్యోగులకువారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్ సౌకర్యాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు


టిటిడిలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న శ్రీ అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న శ్రీ ఎం.డిఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ముస్లిం వర్గాలుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించరాదని సూచించారు.


 కార్యక్రమంలో ఎస్పీబీసీ బోర్డు సభ్యులు శ్రీ బీఆనందసాయిశ్రీ ఎం.ఎస్రాజులు వర్చువల్ గా పాల్గొనగాఎస్వీబీసీ ఇంఛార్జి సీఈవో శ్రీ డిపణికుమార్ నాయుడుపలువురు అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments