వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 23వ తేదిన వార్షిక విశేష పూజను వైభవంగా నిర్వహించనున్నారు.
గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది.
ఈ మేరకు టీటీడీ ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా నిర్వహిస్తోంది.
No comments :
Write comments