27.1.26

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం float festival







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయిఏడు రోజుల పాటు జరుగనున్న  తెప్పోత్సవాల్లో మొదటి రోజు  సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారుఅనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.


మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారుమొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారుఅదేవిధంగా మంగళవారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుహరికథసంగీత కార్యక్రమాలు నిర్వహించారు.


 కార్యక్రమంలో శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని శంకరణ్టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్ఇతర అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments