21.1.26

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం padmavati ammavari temple





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 25 రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌నశుధ్ధి నిర్వహించారుఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారుఅనంతరం నామకోపుశ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు లిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు కార‌ణంగా క‌ల్యాణోత్స‌వంఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

 

12 పరదాలు విరాళం :

 

హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు రెడ్డి 4, శ్రీ స్వ‌ర్ణ‌కుమార్ రెడ్డి 7, చెన్నైకి చెందిన శ్రీ శ్రీ‌నివాస్ - 1 అనే భ‌క్తులు  సంద‌ర్భంగా ఆలయానికి మొత్తం 12 పరదాలను విరాళంగా అందించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ  వో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ఏఈవో శ్రీ దేవ‌రాజులుసూపరింటెండెంట్లు శ్రీ సురేష్‌శ్రీ ర‌మేష్ఆల‌ అర్చ‌కులు పాల్గొన్నారు.


No comments :
Write comments