18.1.26

తిరుమలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం purandaradasa aradanotsavalu







కర్ణాటక సంగీతపద కవితా  పితామహులు శ్రీ పురందరదాసులు సాక్షాత్తు నారద స్వరూపులని శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.


శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.


ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థా మండపంలో సుప్రభాతంధ్యానంసామూహిక భజననగరసంకీర్తన కార్యక్రమాలుపురంద‌ర సాహిత్య‌ గోష్ఠివివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలుసంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహించారుశ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీశ్రీ వీద్యా విజయ తీర్థ స్వామీజీ మంగ‌ళ శాస‌న‌ములు అందించారు.


 సందర్భంగా శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ మాన‌వ జీవితం స‌మ‌స్య‌ల వ‌ల‌య‌మ‌నివీటి నుండి బ‌య‌ట‌ప‌డాలంటే న‌వ‌విధ భ‌క్తిమార్గాల్లో నామ‌సంకీర్త‌న‌కు విశేష ప్రాధాన్యం ఉంద‌ని తెలిపారుభగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని కోవకు చెందిన రమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారునేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారనిఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు.


అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ నందతీర్థాచార్యులు స్వామీజీలకు శ్రీవారి ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.


 కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్కర్ణాటకతమిళనాడుకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.


కాగారెండవ రోజైన జ‌న‌వరి 18 ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారుసాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపుఊంజల్‌సేవదాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.


చివరిరోజు జ‌న‌వరి 19 ఉదయం సుప్ర‌భాతంధ్యానంసామూహిక భ‌జ‌న‌న‌గ‌ర సంకీర్త‌నఉపన్యాసములుసంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments :
Write comments