20.1.26

టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై టిటిడి ఈవో సమీక్ష sv vidyadanam




టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారుటిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.


 సందర్బంగా ఈవో మాట్లాడుతూటిటిడి కళాశాలలుపాఠశాలలలో ఆధుని వసతులు,  అదనపు వసతిఅదనపు రగతి గదులుమినీ సమావేశ మందిరం తదితర మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను దేశించారుఇప్పటికే మౌళిక సదుపాయాలపై టిటిడి పాలక మండలి సబ్ కమిటి 22 రెకమెండేషన్ లను ఇచ్చిందనివాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారుటిటిడి కళాశాలలుపాఠశాలల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే  విడుదలైన నిధులు మినహా మిగిలిన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారుటిటిడి తాజా మౌలిక సదుపాయాల మూలంగా టిటిడి కళాశాలల్లో బాల బాలికలకు అదనంగా 1080 మందికి వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు.


టిటిడి విద్యా సంస్థలలో డిజిటలైజేషన్ , ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డులుకంప్యూటర్లుప్రింటర్స్నెట్ వర్కింగ్ మెటిరియల్సిసి కెమెరాలుమొబైల్ మెడికల్ యూనిట్ , తరగతి గదులుమరుగుదొడ్లుభోజన శాలవంట గదులువేడి నీరుసివిల్ పనులు,  తదితర అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. సదరు అంశాలపై టిటిడి జేఈవోటిటిడి సీఈ ప్రత్యక్షంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని సూచించారు.


 సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంఎఫ్‌ఏ అండ్ సీఏవో శ్రీ బాలాజీసీఈ శ్రీ టి.విసత్యనారాయణడిఈవో శ్రీ వెంకట సునీలు తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments