25.1.26

రథ సప్తమిని విజయవంతం చేసేందుకు ఉద్యోగులందరూ కలిసికట్టుగా పని చేయాలి- ttd addl eo






శ్రీవారి బ్రహ్మోత్సవాలువైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లే రథ సప్తమిని కూడా విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా పని చేయాలని టీటీడీ ఉద్యోగులకు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో రథ సప్తమి డిప్యూటేషన్ విధులు నిర్వహించే ఉద్యోగులుశ్రీవారి సేవకులతో శనివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులుశ్రీవారి సేవకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సమిష్టి కృషితో భక్తులకు సేవలందించాలని చెప్పారుమాడ వీధుల్లోని సిసి కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నామనితద్వారా వాహన సేవలను ఎంతమంది తిలకించారనే ఖచ్చితమైన అంచనా వేయవచ్చని తెలిపారు. టీటీడీ ఉద్యోగులుశ్రీవారి సేవకులు గ్యాలరీల్లోని భక్తులకు అందించే సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు.


 సమావేశంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మంసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీసిఈ శ్రీ సత్యనారాయణడిప్యూటీ సిఎఫ్ శ్రీ ఫణి కుమార్ నాయుడుసీపీఆర్వో డాక్టర్ రవిశ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇతర అధికారులుడిప్యూటేషన్ సిబ్బందిశ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

No comments :
Write comments