11.2.26

ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలుtarigonda temple




అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంతరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు సందర్భంగా మూడు రోజులపాటు వేద మంత్రోచ్చారణల నడుమ వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.


 ఫిబ్రవరి 12 జ్యేష్ఠ నక్షత్రంలో సాయంత్రం అంకురార్పణతో నూతన ధ్వజ స్తంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది సందర్భంగా అఖండ దీపారాధనభగవత్ ప్రార్థన , అంకురార్పణధాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఫిబ్రవరి 13 తేదీన చతుస్థానార్చనహోమంజలాధివాసంక్షీరాధివాసం తదితర వైదిక కార్యక్రమాలను చేపడుతారుఫిబ్రవరి 14 తేదీన

చతుస్థానార్చనఛాయాధివాసంపంచశయాధివాసంలఘు పూర్ణాహుతి జరుగనుంది.  


ఫిబ్రవరి 15 తేదీన త్రయోదశిత్తరాషాడ నక్షత్రయుక్త కుంభ లగ్నపుష్కరాంశయందు ఉదయం 08.16 గం.కు ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం చేపడుతారుఅనంతరం కుంభ ఉద్వాసనంబింబ ఉద్వాసనంమహా సంప్రోక్షణకుంభలగ్నం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారుమహా నివేదనబలిహారణమంగళ శాసనశాత్తుమొర తీర్థ ప్రసాద గోష్ఠి విద్వత్ సంభావనం చేపడుతారు మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టిటిడి కోరుతోంది.


No comments :
Write comments