22.2.26

మంగళంపేటలో ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు dhwajarohanam of brahmotsavams




పులిచర్ల మండలం మంగళంపేటలో ప్రసిద్ధిచెందిన  శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.


ముందుగా శ్రీ‌దేవిభూదేవి స‌మే శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు‌గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 08.00 నుండి 09.00 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడి ధ్వజపటానికి అర్చకులు ప్రత్యే పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుకాగారాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.


ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు


 ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 రకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టిందిబ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 08.00 గం. నుండి 09.00 గం.లకుసాయంత్రం 06.00 గం. నుండి 08.00 గం. వరకు వాహన సేవలు జరుగనున్నాయి.


శనివారం సాయంత్రం 06.00 గం.లకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.


వాహన సేవల వివరాలు


ఫిబ్రవరి 22 తేదీ ఉదయం చిన్న శే వాహనంసాయంత్రం హంస వాహనం, 23 తేదీ ఉదయం ముత్యపు పందిరి వాహనంసాయంత్రం సింహ వాహనం, 24 తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమంత వాహనం, 25 తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం 06.00 గం.లకు కల్యాణోత్సవంరాత్రి 08.00 గం.లకు గరు సేవ, 26 తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనం, 27 తేదీ ఉదయం మోహినీ ఉత్సవంసాయంత్రం గజ వాహనం, 28 తేదీ ఉదయం 08.00 గం.లకు రథోత్సవంసాయంత్రం అశ్వవాహనంమార్చి 01 తేదీన ఉదయం 11.00 గం.కు చక్ర స్నానంరాత్రి 07.00 గం.లకు ధ్వజావరోహణంమార్చి 02 తేదీ ఉదయం 09.00 గం.లకు పుష్పయాగ మహోత్సవం చేపడుతారు.


 కార్యక్రమంలో ఆలయ అర్చకులుసూపరింటెండెంట్ శ్రీ వైనాగేంద్ర ప్రసాద్టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ రాహుల్ యాదవ్జూనియర్ అసిస్టెంట్ శ్రీ శ్రీ హర్షభానుప్రకాశ్సిబ్బందిగ్రామ పెద్దలుభక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments