శ్రీ
కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక శ్రీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వరం అధ్యాపకులు శ్రీ కేశన్న డోలు, శ్రీ నాగేశ్వరరావు బృందం నాదస్వర కచేరి అందరిని ఆకట్టుకుంది. ఇందులో భాగంగా మహాగణపతిం, నిరవది సుఖదా అను కృతులు ఆలపించారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు శ్రీమతి డాll వందన గాత్రం, శ్రీ జయరాం వయోలిన్, శ్రీ రమేష్ మృదంగంపై "గం గం గణపతే...., శంకర శ్రీగిరి.....,గంగాధీశ్వరం...." కృతులు ఆలపించి భక్తులను అలరించారు.
అనంతరం రాత్రి 7:30 నుండి 8:30 వరకు డా. శరత్ చంద్ర బృందం భరతనాట్యం అందరిని ఆకట్టుకున్నాయి భరతనాట్య కార్యకమంలో భాగంగా నర్తన గణపతి, భో శంభో, కాలభైరవ అష్టకం, శంభో మహాదేవ, షణ్ముఖ కౌతం, నటేశ కౌతం, శివ స్తుతి, పరమ పురుషుడు వంటి కృతులకు, కీర్తనలకు సి.సంధ్య, వీణ శర్మ, తన్మయి శ్రీ, ప్రతిక్ష, సమీర, చిన్మయి, రంజిత, యువశ్రీ, శివని, మహాలక్ష్మి, యువన కృతి, తనయ, భవిష్య, మోక్షశ్రీ, భవిష్య ఈ నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం కళాకారులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల గారు అభినందించారు.
No comments :
Write comments