9.2.26

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం dhwajarohanam









తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


అర్చకుల వేదమంత్రోచ్ఛారణశంఖనాదాలుశివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగిందిపంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తిశ్రీ కామాక్షి అమ్మవారుశ్రీ వినాయక స్వామిశ్రీ చండికేశ్వరస్వామిశ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.


ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం


ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకంబలినివేదన, దీపారాధనఉపచారాలు నిర్వహించారుఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారుపెరుగుచందనంవిభూదిపన్నీరుపలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగిందిదీపారాధనలో భాగంగా రథహారతినక్షత్రహారతిసద్యజాతాది దీపారాధనకుంభహారతి నిర్వహించారు తరువాత ఛత్రంచామరాలుఅద్దంసూర్యచంద్రులువిసనకర్రధ్వజంతో ఉపచారాలు చేశారుఅదేవిధంగా రుగ్వేదంయజుర్వేదంసామవేదంఅధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారుకంకణభట్టర్ శ్రీ ఉదయ్ స్వామి గురుకుల్ ఆధ్వ‌ర్యంలో  కార్య‌క్ర‌మం జ‌రిగింది.


అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడుపార్వతిసుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారుపల్లకీపై స్వామిఅమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారుభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


 కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం.రవిచంద్రజేఈఓ శ్రీ వివీరబ్రహ్మం,  సివిఎస్ఓ శ్రీ కే.విమురళీకృష్ణఆలయ ప్రత్యేక అధికారి శ్రీ డిఫణికుమార్ నాయుడుఆలయ సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments