22.2.26

గరుడ వాహనంపై భక్తులను ఆశీర్వదించిన శ్రీవేంకటేశ్వరుడు garuda vahanam







హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా ఐదో రోజైన శనివారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై రాత్రి 7 గంటలకు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందిగరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారుఅంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


కాగా శనివారం ఉదయం 8 గం.లకు మోహిని అవతారంలో భక్తులను కటాక్షించారుఅనంతరం ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనంసాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుందిరాత్రి 7 గంటల నుండి గరుడ వాహన సేవ అశేష భక్తుల ధ్య సాగింది.


ఫిబ్రవరి 22 తేదీ ఉదయం 8 గం.లకు హనుమంత వాహనంమధ్యాహ్నం 3 గం.లకు రథ రంగ ఢోలోత్సవంరాత్రి 7 గం.లకు గజ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.


వాహ‌న‌సేవ‌లో ఎల్ ఏసి ప్రెసిడెంట్ శ్రీ .వి.రెడ్డిఅర్చకులు, ఏఈవో శ్రీ రమేష్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ రికృష్ణపలువురు అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments