17.2.26

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష salaktla teppotsavam




ఫిబ్రవరి 26 నుండి మార్చి 02 తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం అధికారులతో సమీక్ష మావేశం నిర్వహించారు.


 సందర్భంగా తెప్పోత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు:


•  23 తేది తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రైల్ రన్.

•  పుష్కరిణీలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు.

•  పుష్కరిణీతెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ.

•  వరహా స్వామి ఆలయంనాలుగు మా వీధుల్లో పందిళ్లు ఏర్పాటు.

•  భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు.

•  ఫిబ్రవరి 20 నుండి మార్చి 5 తేది వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులను అనుమతించరు.

•  ప్రవేశనిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుపుష్కరిణీలో అందుబాటులో గజ ఈతగాళ్లు.

•  తెప్పోత్సవాలు ప్రాశస్త్యం క్తులకు తెలిసేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు.

•  తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,  27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవఫిబ్రవరి 28మార్చి 01, 02 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.


అనంతరం అదనపు ఈవో మార్చి 3 జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటిపై సమీక్షించారు.


కుమార ధార ముక్కోటి సమీక్ష సమావేశంలో ముఖ్యాంశాలు:


•  మార్చి 3 ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.

•  చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల పైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదు.

•  తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి.


అనంతరం అదనపు ఈవో చంద్ర గ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు:


•  మార్చి 3 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత. (మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం.)

•  వైకుంఠం క్యూ కాంప్లెక్స్రామ్ భగీచాసీఆర్వోల వద్ద భక్తులకు దాదాపు 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు.

•  ఆర్జితసేవలువీఐపీ బ్రేక్ ర్శనాలు రద్దు.

•  చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద ద్మారాధన సేవనుకళ్యాణోత్సవంఊంజల్‌సేవఆర్జిత బ్రహ్మోత్స‌వంసహస్రదీపాలంకార సేవలు రద్దు.

•  వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలుశ్రీవాణి దర్శనాలురూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంచంటి పిల్లల తల్లిదండ్రులువృద్ధులుదివ్యాంగులుదాతలుఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.


 సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథంశ్రీ భాస్కర్  శ్రీ సోమన్నారాయణశ్రీమతి సువర్ణమ్ఈఈలు శ్రీ శ్రీనివాసరావుశ్రీ సుధాకర్వీజీవో శ్రీ సురేంద్రఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments