టిటిడి
ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో బుధవారం ఫుట్బాల్, స్వీమింగ్, బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
- టీటీడీ అధికారుల వాలీబాల్ పోటీలలో శ్రీ వెంకటేశ్వర్లు జట్టు విజయం సాధించగా, శ్రీ రామక్రిష్టారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచారు.
- 45 ఏళ్లు పైబడిన పురుషుల క్యారమ్స్ పోటీలలో శ్రీ వేణుగోపాల్ విజయం సాధించగా, శ్రీ మురళి రన్నరప్గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ మురళి, శ్రీ వేణుగోపాల్ జట్టు విజయం సాధించగా, శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ శ్రీనివాసులు జట్టు రన్నరప్గా నిలిచారు.
- 40 ఏళ్ల లోపు పురుషుల స్వీమింగ్ పోటీలలో శ్రీ ఈశ్వర్ రెడ్డి ప్రథమ, శ్రీ అమర్నాథ్ ద్వితీయ, శ్రీ విష్ణువర్థన్ తృతీయ స్థానలో నిలిచారు.
- 40 ఏళ్ళు పైబడిన పురుషుల స్వీమింగ్ పోటీలలో శ్రీ సత్యనారాయణ రాజు ప్రథమ, శ్రీ భాస్కర్ ద్వితీయ, శ్రీ మల్లిఖార్జున్ తృతీయ స్థానలో నిలిచారు.
- 45 ఏళ్ల లోపు మహిళల పాసింగ్ లగేజి పోటీలలో శ్రీమతి రేఖ విజయం సాధించగా, శ్రీమతి మునిలత రన్నరప్గా నిలిచారు.
- 45 ఏళ్లు పైబడిన మహిళల టెన్నికాయిట్ సింగల్స్ పోటీలలో శ్రీమతి శ్రీలక్ష్మీ విజయం సాధించగా, శ్రీమతి లలిత రన్నరప్గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సునంద, శ్రీమతి శ్రీలక్ష్మీ జట్టు విజయం సాధించగా, శ్రీమతి సుదారాణి, శ్రీమతి రాజేశ్వరి జట్టు రన్నరప్గా నిలిచారు.
- టిటిడి విశ్రాంత ఉద్యోగుల పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీ సుబ్బన్న జట్టు విజయం సాధించగా, శ్రీ హరి జట్టు రన్నరప్గా నిలిచారు.
No comments :
Write comments