శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి గురువారం 6 గొడుగులు కానుకగా అందాయి. తిరునిన్రావుర్కు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ శ్రీ దినేష్కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు.
ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాష్రెడ్డి, చంద్రగిరి ఎం.ఎల్.ఏ శ్రీ పులివర్తి నాని, జేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీకి అందించారు.
No comments :
Write comments