25.3.26

మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు - మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు teppotsavams




తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి 29 తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.


మార్చి 27 శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకందయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనంమధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుందిరాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.


మార్చి 28 శ్రీ సీతారాముల కల్యాణం :


మార్చి 28 తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి త్సవర్లకు అభిషేకం చేస్తారుఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారుసాయంత్రం 6 నుండి 9 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుందిరూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చువీరికి ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.


మార్చి 29 శ్రీరామ పట్టాభిషేకం :


మార్చి 29 ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు.  తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులనుప్రత్యే తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.


మార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు మార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారుమొదటిరోజు ఐదుచుట్లురెండో రోజు ఏడు చుట్లుచివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

No comments :
Write comments