24.3.26

మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి tumburu mukkoti




తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సి  ఏర్పాట్లపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు:


భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తారీఖులలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే  అనుమతిస్తారు.


పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారంఅన్న‌ప్ర‌సాదాలుత్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారుప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలుఅంబులెన్సులుమందులుపారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.


తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకుదీర్ఘవ్యాధిగ్రస్తులకుగుండెశ్వా కోస సమస్యలుస్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.


భ‌క్తులు వంట సామగ్రిక‌ర్పూరంఅగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


పోలీసుశాఖఅటవీశాఖటీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.


తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారుట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారుప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.


 విషయాలను దృష్టిలో ఉంచుకుని హకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.


No comments :
Write comments