24.3.26

సూర్య కిరణాల తేజస్సులో విరాజిల్లిన శ్రీ కోదండరాముడు surya prabha vahanam










తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.


ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


సూర్యుడు తేజోనిధిసకలరోగ నివారకుడుప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలువాటివల్ల పెరిగే సస్యాలుచంద్రుడుఅతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.


అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమే శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో అభిషేకం చేశారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మార్చి 24 రథోత్సవం :


శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా జరుగనుందిఉదయం 7.30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారుఉదయం 8.30 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారురాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


No comments :
Write comments