17.3.26

తరతరాలకు స్ఫూర్తినిచ్చే అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంపద– టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి annamayya




శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తితాత్వికతమానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వమైన సాహిత్య సంపదగా నిలిచాయని టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి తెలిపారుఅన్నమయ్య 523 వర్థంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి.


 సందర్భంగా శ్రీ కృష్ణమూర్తి “అన్నమయ్య కవితా రామణీయకం” అనే అంశంపై మాట్లాడుతూశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కవిత్వం మాధుర్యంసరళతభావగాంభీర్యంతో తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిందన్నారుఆయన సంకీర్తనల్లో భక్తి భావంతో పాటు కవితా సౌందర్యంసులభమైన పదజాలంమధురమైన లయలోతైన ఆధ్యాత్మిక తాత్వికత సమన్వయంగా కనిపిస్తాయని చెప్పారుభావపూర్ణమైన పదప్రయోగం, అలంకారాల వినియోగంసంగీతానికి అనుకూలమైన కవితా నిర్మాణం అన్నమయ్య కవితా రామణీయకానికి ప్రధా లక్షణాలని వివరించారు.


అనంతరం విజయవాడకు చెందిన ఆచార్య నిర్మల “అన్నమయ్య రచనా వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తూశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు క్తి సాహిత్యంలో అజరామరమైన స్థానం సంపాదించిన మహాకవి అని పేర్కొన్నారుశ్రీ వేంకటేశ్వర స్వామివారిపై రచించిన వేలాది సంకీర్తనల్లో భక్తితత్వంమానవీయ విలువలుసామాజిక స్పృహ సమన్వయంగా ప్రతిఫలిస్తాయని తెలిపారుభక్తి భావంతో పాటు జీవిత సత్యాలునైతిక విలువలను ఆయన సంకీర్తనల్లో చక్కగా ప్రతిబింబించారని చెప్పారు.


తదుపరి ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య సర్వోత్తమరావు “అన్నమయ్య సంకీర్తనల్లో మానవీయ సంబంధాలు” అనే అంశంపై మాట్లాడుతూఅన్నమయ్య కీర్తనల్లో తల్లిబిడ్డల అనుబంధంభర్తభార్యల ప్రేమగురుశిష్య సంబంధంభక్తుడుభగవంతుడి అనుబంధం వంటి అనేక మానవీయ సంబంధాలను ఎంతో హృద్యంగా చిత్రించారని చెప్పారుసాధారణ జీవితంలో కనిపించే అనురాగంకరుణదయ వంటి విలువలను యన సంకీర్తనల ద్వారా తెలియజేశారని పేర్కొన్నారుఅందువల్ల అన్నమయ్య సంకీర్తనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాకుండా మానవ సంబంధాల సౌందర్యాన్ని ప్రతిబింబించే సాహిత్య రత్నాలుగా నిలిచాయని తెలిపారు.


తర్వాత తిరుపతికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం “సామాజిక చైతన్య శీల అన్నమయ్య” అనే అంశంపై ప్రసంగించారు.


సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం సంగీత కార్యక్రమంరాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విశాఖపట్నానికి చెందిన శ్రీమతి ప్రశాంతి బృందం వీణా వాయిద్య కార్యక్రమం నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్సంచాలకులు శ్రీమతి లతఇతర అధికారులుపురప్రజలు పాల్గొన్నారు.


No comments :
Write comments