8.3.26

తిరుమల అశ్విని ఆసుపత్రిని తనిఖీ చేసిన టీటీడీ జేఈవో (విద్య, వైద్య) డా. ఎ. శరత్ aswini hospital



తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రి మరియు డిస్పెన్సరీలను టీటీడీ జేఈవో (విద్యవైద్యడాశరత్ శనివారం ఉదయం తనిఖీ చేశారు


 సందర్భంగా వైద్య సేవల నిర్వహణభక్తులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.


అశ్విని ఆసుపత్రిడిస్పెన్సరీలలో ప్రవేశనిష్క్రమణ ద్వారాలను భక్తులకు స్పష్టంగా తెలియజేసేలా తగిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు


రక్తదానానికి సంబంధించిన వివరాలను ఓపీ నమోదు రిజిస్టర్‌లో కాకుండా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారుఅశ్విని ఆసుపత్రిలో ఈసీజీ పరీక్షలు చేయించుకునే రోగుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని తెలిపారుక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు పీఏసీ–5 ఉచిత డిస్పెన్సరీలో వెంటనే ఒక వైద్యుడిని నియమించాలని ఆదేశించారు.


అశ్విని ఆసుపత్రి వద్ద ప్రవేశ ద్వారం లేదా వెనుక భాగంలో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారుఅలాగే జీఎన్‌సీ వద్ద భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.


అదేవిధంగా రోగుల నమోదు వివరాలను  కేస్ షీట్‌లో వ్యాధి నిర్ధారణను స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.


 తనిఖీలో టీటీడీ సిఎంవో డాకుసుమ కుమారిఅశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాసుబ్బా రెడ్డిఇతర అధికారులువైద్యులు పాల్గొన్నారు.




No comments :
Write comments