24.3.26

శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని ఉత్తమ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలి – టిటిడి జే వో డా. ఎ. శరత్ ayurveda pharmacy






టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని ఉత్తమమైన ప్రయోగశాలగా అభివృద్ధి చేయాలని టిటిడి జేఈవో (వైద్యంవిద్యడాశరత్ అధికారులకు సూచించారుసోమవారం శ్రీనివాస మంగాపురం సమీపంలోని నరసింగాపురంలో ఉన్న ఫార్మసీని ఆయన సందర్శించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూఫార్మసీ 19 ఎకరాల విస్తీర్ణంలో ఉందని తెలిపారుఇందులో సమగ్రంగా హెర్బల్ మెడిసిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారురోగాలకు అవసరమైన మందులువాటికి అవసరమైన మొక్కలుప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులుఅలాగే బయట నుంచి తీసుకొస్తున్న ఔషధ మొక్కల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.


బయట నుంచి ఔషధ మొక్కలపై ఆధాపడే విధానాన్ని తగ్గించిఫార్మసీ భూమిలోనే ప్రణాళికాబద్ధంగా మొక్కలను పెంచిఅవసరమైన ముడి పదార్థాలను ఇక్కడే మరింత నాణ్యంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారుఫార్మసీ భూమిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చిహెర్బల్ మెడిసిన్ ప్లాంట్‌గా అభివృద్ధి చేయాలని తెలిపారు.


ప్రస్తుతం పెంచుతున్న మొక్కలుబయట నుంచి తెచ్చే మొక్కల వివరాలు సేకరించివాటిని ఎంతవరకు తగ్గించవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు భూమిని ప్రయోగశాలలా అభివృద్ధి చేసిఆకులువేర్లుచెక్కలు వంటి ఔషధ భాగాలకు అవసరమైన మొక్కలను ఇక్కడే పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


సమీక్ష అనంతరం ఫార్మసీలో తయారు చేస్తున్న ఉత్పత్తులనుయంత్రాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.


 కార్యక్రమంలో ఏపీ ఔషధసుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో శ్రీ చంద్రశేఖర్ఫార్మసీ ఇన్‌చార్జ్ డారేణు దీక్షిత్ఎస్. శ్రీ నరసింహ మూర్తిడీఈ శ్రీ దామోదర్ తదితర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments