21.3.26

అన్నమయ్య తొలి శతకం – భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకం – గిరిజా మనోహర్ బాబు






తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు వారు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారనిఆయన సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తితత్వసాహిత్య పరంగా అపూర్వ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని హనుమకొండకు చెందిన విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు పేర్కొన్నారుశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు శుక్రవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి..


 సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ గిరిజా మనోహర్ బాబు మాట్లాడుతూశ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమనుభక్తి మార్గాన్నిజీవన సారాన్ని సులభమైన తెలుగు భాషలో ప్రజలకు చేరువ చేసిన కీర్తనల సమాహారమే  తొలి శతకమని తెలిపారుఅన్నమయ్య సంకీర్తనలలోని ఆధ్యాత్మికతసంగీత మాధుర్యం క్తులను ఆహ్లాదపరుస్తూనే ఆత్మీయతను పెంపొందిస్తాయని చెప్పారు. అన్నమాచార్యుల సాహిత్య సంపదను పరిరక్షించిప్రచారం చేయడంలో టిటిడి కీలక పాత్ర పోషిస్తున్నదనిభక్తులు  కీర్తనలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆకాంక్షించారు.


 తరువాత  తిరుపతికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్  వెంకట శంకర భవన్ “అన్నమయ్య సంకీర్తనలు – వేదాంత ప్రసక్తి” అనే అంశంపై మాట్లాడుతూ,  అన్నమయ్య కీర్తనల్లో వేదాంత తత్వం విస్తృతంగా ప్రతిఫలిస్తుందని తెలిపారుజీవాత్మపరమాత్మ ఏకత్వంమాయ స్వరూపంభక్తి ద్వారా పరమార్థ సాధన వంటి గాఢమైన తాత్విక భావాలను అన్నమయ్య సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిష్కరించారని చెప్పారు.


అనంతరం తిరుపతికి చెందిన పరిశోధకులు డాక్టర్ రాజశేఖర్ “అన్నమయ్య సంకీర్తనలు – కృష్ణ తత్వం” అనే అంశంపై ప్రసంగిస్తూశ్రీకృష్ణుని లీలలుమాధుర్యభావంగోపికాభక్తి వంటి అంశాలను అన్నమయ్ గాఢమైన ఆధ్యాత్మిక భావంతో వ్యక్తీకరించినట్లు తెలిపారుఆయన కీర్తనలు భక్తిని మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని బోధించే ఆధ్యాత్మిక మార్గదర్శకాలుగా నిలిచాయని వివరించారు.


 కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లతఇతర అధికారులుభక్తులుసాహితీప్రియులు పాల్గొన్నారు.


No comments :
Write comments