శ్రీ
కోదండరా
మస్వామివారి
వార్షిక
బ్రహ్మోత్
సవాల్లో
భాగంగా
మూడవ
రోజు
గురు
వారం
ఆలయ
ప్రాంగణంలో
ఏర్పాటు
చే
సిన
సాంస్కృతిక
వేదికపై
నిర్వహిం
చిన
సంగీత
, నృత్య
కార్యక్రమాలు
భక్తులను
మంత్రముగ్ధులను
చేశాయి
.
ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 7.15 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు డా. మండా అనంతకృష్ణ బృందం “పిబరే రామరసం”, “ఆడమోడి గలదా”, “రఘువంశ సుధాంభుది”, “ఏ తీరుగా నను”, “కరుణాజలధే”, “మీరా భజన్” వంటి కృతులను సుమధురంగా ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు.
అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సి. హరినాథ్ బృందం “మేలుకో వయ్య”, “శరణు శరణు నీకు”, “పెరిగి నాడు చూడరో”, “దేవ దుందుభుల తోడ”, “ఎరుట ఎవ్వరు లేరు”, “అంబా శాంభవి”, “వాసుదేవ కమలాసన”, “కురై ఒండ్రుం ఇల్లై”, “చూడరమ్మ చెలురాల”, “శివరంజని”, “తిల్లానా” వంటి అంశాలతో నృత్య ప్రదర్శనలు ఇచ్చి భక్తులను అలరించారు.
ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మాధుర్యంతో నింపాయి.
No comments :
Write comments