2.3.26

తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం malayappa






తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.


ముందుగా స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారువిద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు


మంగళవాయిద్యాలు‌వేదపండితుల వేదపారాయ‌ణంఅన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.


 తెప్పోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామిఅదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిడిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంపేష్కార్ శ్రీ రామ కృష్ణఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments