3

తిరుమలలోని
అదనపు ఈవో కార్యాలయం సమీపంలో సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతనంగా నిర్మించిన సింహ నిలయం అతిథి గృహాన్ని బుధవారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ నూతన కాటేజీ డొనేషన్ పాలసీ ద్వారా సెల్ కాన్ సంస్థ నూతనంగా అతిథి గృహాన్ని నిర్మించి టీటీడీకి అప్పగించిందని చెప్పారు. ఈ పాలసీ ద్వారా దాదాపు 24 అతిథి గృహాలను దాతల ద్వారా నిర్మించేందుకు అనుమతించడం జరిగిందన్నారు. అందులో ఇప్పటి వరకు 16 అతిథి గృహాలను దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించినట్లు చెప్పారు. తద్వారా దాదాపు 200 రూములు అదనంగా భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
యాత్రికుల వసతి సముదాయం-1 ను కూడా ఆత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు చెందిన భక్తులకు తిరుమలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, సెల్ కాన్ సంస్థ సీఎండీ శ్రీ గురుస్వామి నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments